ముఖ్యమంత్రి కిరణ్ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతునిస్తే ఖాయంగా ప్రభుత్వం కూలిపోతుందని, అలా కాని పక్షంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైఎస్సార్ కాంగ్రెస్ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి సవాలు విసిరారు. ఆయన గురువారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ... బొటాబొటిగా ప్రభుత్వం కొనసాగుతున్న తరుణంలో టీడీపీ అవిశ్వాసానికి మద్దతివ్వడం లేదంటే ఆ పార్టీకి ముడుపులు అందినట్లుగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇపుడు ఆ పార్టీపై అవిశ్వాసం పెట్టకుండా పాత రుణాన్ని తీర్చుకున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇపుడు ఎందుకు అవిశ్వాసం పెట్టకుండా వెనుకాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Home »
» 'అవిశ్వాసం వీగిపోతే రాజకీయాల్లో ఉండను'
'అవిశ్వాసం వీగిపోతే రాజకీయాల్లో ఉండను'
Written By ysrcongress on Friday, March 15, 2013 | 3/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment