టీడీపీ అధినేత చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. కిరణ్ సర్కారును దించేయాలని బహిరంగంగా ప్రగల్బాలు పలుకుతున్న బాబు తెరవెనుక కాంగ్రెస్ తో లాలూచీ పడ్డారని ఆరోపించారు.
అసెంబ్లీ వేదికగా ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన విపక్ష నేత అధికార పక్షంతో కుమ్మక్కపోయి నీచరాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అవిశ్వాసం నుంచి ప్రభుత్వం బయటపడేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదని అంబటి హెచ్చరించారు.
అసెంబ్లీ వేదికగా ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన విపక్ష నేత అధికార పక్షంతో కుమ్మక్కపోయి నీచరాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అవిశ్వాసం నుంచి ప్రభుత్వం బయటపడేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదని అంబటి హెచ్చరించారు.
0 comments:
Post a Comment