పాదయాత్ర సందర్భంగా.. అధికార పక్షాన్ని నరకండి, పొడవండని కొండంత రాగం తీసిన చంద్రబాబు తీరా సమయం వచ్చాక ఎందుకు వెనక్కుతగ్గుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాల్సిన బాధ్యత బాబుకు లేదా? అని నిల దీశారు. ప్రజల కష్టనష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నట్టు చెబుతున్న చంద్రబాబు అవిశ్వాసానికి ముందుకు రాకపోతే అధికారపార్టీతో కుమ్మక్కయినట్టే భావించాల్సి ఉంటుందని చెప్పా రు.
అవిశ్వాస తీర్మానం పెడితే వచ్చే ఎన్నికల్లో ప్రమాదం తప్పదని చంద్రబాబునాయుడు భయపడుతున్నారని ఎమ్మెల్యే నాగం జనార్ధనరెడ్డి అన్నారు. అందుకే అవిశ్వాసం పెట్టేందుకు ముందుకు రావటం లేదని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కల్పిస్తే చంద్రబాబు పాదయాత్రలతో కాలయాపన చేస్తున్నారని నాగం మండిపడ్డారు.
అవిశ్వాస తీర్మానం పెడితే వచ్చే ఎన్నికల్లో ప్రమాదం తప్పదని చంద్రబాబునాయుడు భయపడుతున్నారని ఎమ్మెల్యే నాగం జనార్ధనరెడ్డి అన్నారు. అందుకే అవిశ్వాసం పెట్టేందుకు ముందుకు రావటం లేదని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కల్పిస్తే చంద్రబాబు పాదయాత్రలతో కాలయాపన చేస్తున్నారని నాగం మండిపడ్డారు.
0 comments:
Post a Comment