పేదల్ని ప్రభుత్వం కాల్చుకు తింటోంది: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేదల్ని ప్రభుత్వం కాల్చుకు తింటోంది: షర్మిల

పేదల్ని ప్రభుత్వం కాల్చుకు తింటోంది: షర్మిల

Written By ysrcongress on Monday, March 18, 2013 | 3/18/2013

రైతుల్ని, పేదల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చుకుతింటోందని షర్మిల మండిపడ్డారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో గుంటూరు జిల్లాలో మామిళ్ల పల్లిలో జరిగిన సమావేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 32వేల కోట్ల విద్యుత్ చార్జీలను రక్తం పిండైన వసూలు చేయాలనుకుంటున్నారని షర్మిల అన్నారు. నిజమైన లబ్ధిదారుల ఫించన్లు, రేషన్‌కార్డులు కూడా ఈ ప్రభుత్వం తీసేస్తుందని షర్మిల అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ మాత్రమే సరఫరా చేస్తున్నారని.. రాష్ట్రంలోరైతులంతా కష్టాలపాలవుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేసింది.

జగనన్న బయటకు వస్తే అన్ని సక్రమంగా జరుగుతాయని, రైతులకు 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారని గ్రామస్థుల్లో షర్మిల భరోసా నింపారు. జగనన్న త్వరలోనే బయటకువస్తారని.. రాజన్న రాజ్యం స్థాపిస్తారని షర్మిల అన్నారు.
Share this article :

0 comments: