టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏసి బస్సులో తిరుగుతూ పాదయాత్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల విమర్శించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం నరసరావుపేట చేరింది. పాత పల్నాడు బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఈ ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నా చంద్రబాబు పెట్టడంలేదన్నారు. పేదల బాధలు బాబుకు పట్టవన్నారు. పేదల బాధలు చూసి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చలించిపోయారన్నారు.
షర్మిలను చూసేందుకు, ఆమె ప్రసంగం వినేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. భారీ వర్షం కురుస్తున్నా జనం కదలకుండా ఆమె ప్రసంగం ఆసక్తిగా విన్నారు.
షర్మిలను చూసేందుకు, ఆమె ప్రసంగం వినేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. భారీ వర్షం కురుస్తున్నా జనం కదలకుండా ఆమె ప్రసంగం ఆసక్తిగా విన్నారు.
0 comments:
Post a Comment