మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలమరోప్రజాప్రస్థానం 106వ రోజు శనివారం గోసాల నుంచి ప్రారంభమవుతుందని ఆ పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. కంకిపాడు, పొద్దుటూరు రోడ్డు, దాములూరు రోడ్డు, చలివేంద్రపాలెం రోడ్డు వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందన్నారు. అనంతరం పెదఓగిరాల రోడ్డు, ఆకునూరు, చినఓగిరాల రోడ్డు, గండిగుంట, ఉయ్యూరు వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. అక్కడే బహిరంగసభ నిర్వహించిన తరువాత సీబీఎం కాంపౌండు వద్ద రాత్రి బస చేస్తారని చెప్పారు.
పర్యటించే ప్రాంతాలు
కంకిపాడు, పొద్దుటూరు, దాములూరు, చలివేంద్రపాలెం, పెదఓగిరాల, ఆకునూరు, చినఓగిరాల, గండిగుంట, ఉయ్యూరు.
పర్యటించే ప్రాంతాలు
కంకిపాడు, పొద్దుటూరు, దాములూరు, చలివేంద్రపాలెం, పెదఓగిరాల, ఆకునూరు, చినఓగిరాల, గండిగుంట, ఉయ్యూరు.
0 comments:
Post a Comment