సీబీఐ కాంగ్రెస్ పార్టీకి తొత్తులా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్వతంత్ర ప్రతిపత్తితో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఉపయోగపడటం లేదని ఆయన శుక్రవారమిక్కడ ఆక్షేపించారు. తనను వ్యతిరేకించిన పార్టీలను వేధించేందుకు కాంగ్రెస్ సీబీఐని ఆయుధంలా వాడుకుంటోందని భూమన ధ్వజమెత్తారు.
డీఎంకే నేత స్టాలిన్ నివాసంపై జరిగిన దాడులతో సీబీఐ కాంగ్రెస్ మధ్య బంధం బయటపడిందని విమర్శించారు. పది నెలలుగా జగన్ను ప్రజల నుంచి దూరంగా ఉంచినా ప్రజాదరణ వెల్లువెత్తుతుందని భూమన అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి సీబీఐ, ఈడీలను దుర్వినియోగపరచడం ప్రజాస్వామానికి మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.
డీఎంకే నేత స్టాలిన్ నివాసంపై జరిగిన దాడులతో సీబీఐ కాంగ్రెస్ మధ్య బంధం బయటపడిందని విమర్శించారు. పది నెలలుగా జగన్ను ప్రజల నుంచి దూరంగా ఉంచినా ప్రజాదరణ వెల్లువెత్తుతుందని భూమన అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి సీబీఐ, ఈడీలను దుర్వినియోగపరచడం ప్రజాస్వామానికి మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.
0 comments:
Post a Comment