ఒకే ఒక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసెంబ్లీలో మిగతా పార్టీలన్నీ దాడిచేశాయని జోగి రమేష్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఈస్థితిలో ఉందంటే అది వైఎస్ఆర్ చలవేనని జోగి రమేష్ అన్నారు. ఇంత సేవ చేసిన వైఎస్ఆర్పై అన్ని పార్టీలు మూకుమ్మడిగా దాడిచేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ విజయమ్మను టార్గెట్ చేస్తుంటే తాను తట్టుకోలేకపోయానని జోగిరమేష్ అన్నారు. ఇప్పటికే తాను వైఎస్ కుటుంబం వెంట ఉండాలని, అలా చేయక ఇన్నాళ్లూ పొరపాటు చేశానన్నారు. అయితే అవిశ్వాస తీర్మానంలో నా పొరపాటును సరిదిద్దుకున్నాను అని జోగిరమేష్ తెలిపారు. తనకు వైఎస్ఆర్ తప్ప మరే కాంగ్రెస్ నాయకుడు తెలియదని, వైఎస్ఆర్ టిక్కెట్ ఇప్పిస్తే.. తాను ఆనాడు గెలిచానని జోగిరమేష్ తెలిపారు |
Home »
» విజయమ్మను టార్గెట్ చేస్తే తట్టుకోలేకపోయా
విజయమ్మను టార్గెట్ చేస్తే తట్టుకోలేకపోయా
Written By news on Sunday, March 17, 2013 | 3/17/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment