విద్యుత్ సమస్యపై ప్రభుత్వం మెడలు వంచేందుకు తాము చేపట్టిన ఉద్యమంలో కలిసి రావాలని వామపక్షాల నేతలు అజీజ్పాషా (సీపీఐ), వై వెంకటేశ్వరరావు (సీపీఎం), జానకి రాములు(ఆర్ఎస్పీ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కోరారు. వచ్చే నెల 9న తలపెట్టిన రాష్ట్ర బంద్కు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. గురువారం వారు విజయమ్మను ఆమె నివాసంలో కలిసి ఈమేరకు ఒక వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డీఏ సోమయాజులు, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వామపక్షాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యపై విపక్షాలన్నీ కలిసి పోరాడాలని భావించి అన్ని పార్టీల మద్దతు కోరుతున్నామని చెప్పారు. తమ విన్నపంపై వైఎస్సార్ సీపీ నేతలు సానుకూలంగా స్పందించారని చెప్పారు.ఈ ఉద్యమంలో వైఎస్సార్ సీపీ చేరితే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవచ్చన్నారు.
Home »
» విజయమ్మతో వామపక్ష నేతల భేటీ
విజయమ్మతో వామపక్ష నేతల భేటీ
Written By news on Friday, March 29, 2013 | 3/29/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment