ఇది చంద్రబాబు పాలనే! బాబు హయాంలో తొమ్మిదేళ్లూ కరువే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది చంద్రబాబు పాలనే! బాబు హయాంలో తొమ్మిదేళ్లూ కరువే

ఇది చంద్రబాబు పాలనే! బాబు హయాంలో తొమ్మిదేళ్లూ కరువే

Written By news on Saturday, March 30, 2013 | 3/30/2013

మరో ప్రజాప్రస్థానంలో షర్మిల మండిపాటు
టీడీపీ పాలనలో లక్షలాది మంది వలసలు పోయారు
కన్నబిడ్డలు ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లారు
ఇంటి దగ్గర ఉన్న వృద్ధులకు కనీసం పింఛన్లు కూడా ఇవ్వలేదు
అప్పులకు తాళలేక వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
రాష్ట్రంలో అవే పరిస్థితులు ఇప్పుడూ ఉన్నాయి..
ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చంద్రబాబు అండగా నిలిచారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 105, కిలోమీటర్లు: 1,430.5

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబు నాయుడు హయాంలో వర్షాల్లేక.. పంటలు పండక తొమ్మిదేళ్ల కరువొచ్చింది. సాయం చేసే చేతులు లేక లక్షలాది మంది ఇళ్లను వదిలి పొట్టకూటి కోసం ఎక్కడెక్కడికో వలసలు పోయారు. కన్న బిడ్డలు ఉపాధి వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతే.. ఒంట్లో సత్తువ లేక నడిచే ఓపిక లేక ఎంతో మంది వృద్ధులు ఇంటి వద్దే ఉన్నారు. వాళ్లకు కనీసం వృద్ధాప్య పింఛన్ ఇవ్వలేదు. దేశం కాని దేశం పోయి ఎంతోకొంత సంపాదించి తమ ముసలి తల్లికి పంపిన సొమ్ము సకాలంలో అందక ఎంతోమంది వృద్ధులు ఆకలితో చనిపోయారు. అప్పుల బాధలు తట్టుకోలేక వేలాది మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంత భయంకరమైన రోజులవి. అదే పాడు పరిపాలన మళ్లీ వచ్చింది.. చంద్రబాబు పాలనకు కొనసాగింపుగా కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగుతోంది..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లో సాగింది. కానూరు గ్రామంలో కొందరు వలస కూలీలు షర్మిలకు ఎదురుపడ్డారు. ‘అమ్మా.. మేం కొందరం విజయనగరం జిల్లా పార్వతీపురం, బొబ్బిలి, ఇంకొందరు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి వచ్చాం. ఊళ్లో పని దొరక్క రెండేళ్ల కిందట.. పిల్లలను ముసలోళ్ల దగ్గరే వదిలేసి విజయవాడకు వలస వచ్చాం. ఇక్కడ రోజుకు రూ.150 దాకా కూలీ పడుతుందమ్మా’ అని గాంధారి రామలీల, చంద్రగిరి భవాని అనే మహిళలు చెప్పగా.. షర్మిల పై విధంగా స్పందించారు. అనంతరం పెనమలూరులో మహిళలతో కలిసి రచ్చబండలో కొద్దిసేపు మాట్లాడారు. మాటల సారాంశం ఆమె మాటల్లోనే...

పల్లెలను బాబు పీల్చి పిప్పి చేశారు..

చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ల పాలనలో రైతులను పురుగులను చూసినట్లు చూశారు. వ్యవసాయం దండగన్నారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చెప్పారు. రూ.వేలకు వేలు కరెంటు బిల్లులు వేసి రైతులను, పల్లెలను పీల్చి పిప్పి చేసిన ఆయన.. ఇప్పుడు మళ్లీ ‘మీకోసం’ పాదయాత్ర అంటూ అవే పల్లెల వెంట తిరుగుతున్నారు. పాదయాత్ర చేస్తున్నాడు కదా.. ప్రజా సమస్యలు అర్థం చేసుకుని, రైతులకు, రైతు కూలీలకు అండగా నిలబడుతారు అనుకున్నాం. ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి కూలగొడతారు అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడుకు ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యం. ఆయనకు కావాల్సింది రాజకీయాలు. ఏ పని చేసినా రాజకీయంగానే ఆలోచన చేస్తారు. ఎంతటి నీచానికైనా దిగజారుతారు. రైతులు ఏమైపోయినా ఆయనకు పట్టదు. ఆరోజు అధికారం కోసం పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచారు. ఈ రోజు తన అవినీతిపై సీబీఐ విచారణ తప్పించుకోవడానికి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడితే.. అవిశ్వాసానికి మద్దతిచ్చి ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణగా నిలబడ్డారు. ఇది చంద్రబాబు నైజం. నమ్మక ద్రోహం, అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ఆయన రక్తంలోనే ఉందని ఆయనకు పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్ గారే చెప్పారు.

శుక్రవారం 105వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమటి లంక నుంచి ప్రారంభమైంది. ఎన్టీఆర్ సర్కిల్, ఆటోనగర్, కామయ్యతోపు మీదుగా పెనమలూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. షర్మిల నడిచినంత దూరం రోడ్డుకు ఇరువైపులా జనం కిక్కిరిసిపోయారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి, షర్మిలతో కరచాలనం చేయడానికి ఎగబడ్డారు. గోసాల గ్రామంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.30 గంటలకు షర్మిల చేరుకున్నారు. శుక్రవారం 16.4 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,430.5 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యే కొడాలి నాని, జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధ, రత్న బోసు, జ్యేష్ట రమేష్, పార్టీ నాయకులు ఆర్కే, ఎంవీఎస్ నాగిరెడ్డి, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, తాడి శకుంతల, డాక్టర్ హరికృష్ణ స్థానిక నాయకులు పటమట సురేష్‌బాబు, తాతినేని పద్మావతి తదితరులున్నారు.

రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది

వైఎస్సార్ కంటే ముందు చాలా సీఎంలు రాష్ట్రాన్ని పాలించారు. ఆయన తర్వాత కూడా పాలించారు. కానీ ఒక్క వైఎస్సార్ సువర్ణ యుగం లో మాత్రమే రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది. ఆ పాలనలో పిలిస్తే వర్షాలు పడ్డాయి. వైఎస్ రైతుల పక్షపాతి. కన్నతండ్రి స్థానంలో ఉండి రైతు, మహిళ, విద్యార్థులు, మైనార్టీలు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలను అర్థం చేసుకున్నారు. ఇప్పటి పాలకులకు రైతు సమస్యలే పట్టవు. అమ్మా.. అయ్యా.. జగనన్న తరపున ఒక్క మాట చెప్తున్నా. ఓపిక పట్టండి.. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.
- షర్మిల
Share this article :

0 comments: