తన కుమారుడు తేళ్లూరి వీరభద్రారెడ్డి మరణంపై కొందరు రాజకీయ నాయకులు, కొన్ని పత్రికలు, చానళ్లు రాజకీయం చేస్తున్నట్లు మృతుని తండ్రి వెంకటరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. వీరభద్రారెడ్డి గత నెల 25న జగ్గయ్యపేట మండలం పోచంపల్లి గ్రామ శివార్లలో మృతి చెందాడని ఆయన తెలిపారు. బాధలో ఉన్న తమ కుటుంబానికి సానుభూతి తెలపాల్సింది పోయి రాజకీయాలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. తన కుమారుడి మృతదేహం వద్ద లభించిన లేఖను పోలీసులకు అందజేసినట్లు వెంకటరెడ్డి తెలిపారు. వీరభద్రారెడ్డి మరణానికి, బ్రదర్ అనిల్కుమార్కు ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. అతను కొండలరావు దగ్గర పనిచేసిన 19 ఏళ్ల కాలంలో ఏనాడూ బ్రదర్ అనిల్ గురించి చెప్పలేదని, ఆయన ఎవరో కూడా తమకు ఇంతవరకు తెలియదని వివరించారు.
Home »
» నా బిడ్డ మృతిపై రాజకీయం: వీరభద్రారెడ్డి తండ్రి
నా బిడ్డ మృతిపై రాజకీయం: వీరభద్రారెడ్డి తండ్రి
Written By news on Tuesday, March 5, 2013 | 3/05/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment