వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 104వ రోజుకు చేరింది. గురువారం ఉదయం ఆమె జింఖానా గ్రౌండ్స్ నుంచి యాత్రను ప్రారంభించారు. రమాటాకీస్, అలంకార్ టాకీస్, వినోదా టాకీస్, అరందాల్పేట, సీతారాంపురం మీదుగా షర్మిల చుట్టుగుంట చేరుకుంటారు.
భోజన విరామం అనంతరం విశాలాంధ్ర సెంటర్, మెట్రోసెంటర్, శిఖామణిసెంటర్, బందర్రోడ్ మీదుగా రాణిగారి తోట చేరుకుంటారు. ఇక్కడ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం బాలాజీ నగర్, పూర్ణచంద్రనగర్ మీదుగా.. రామలింగేశ్వరనగర్ వరకు పాదయాత్ర కొనసాగిస్తారు. పడమటలంక రోడ్లో రాత్రి బస చేస్తారు. ఇవాళ మొత్తం 10 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేస్తారు.
భోజన విరామం అనంతరం విశాలాంధ్ర సెంటర్, మెట్రోసెంటర్, శిఖామణిసెంటర్, బందర్రోడ్ మీదుగా రాణిగారి తోట చేరుకుంటారు. ఇక్కడ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం బాలాజీ నగర్, పూర్ణచంద్రనగర్ మీదుగా.. రామలింగేశ్వరనగర్ వరకు పాదయాత్ర కొనసాగిస్తారు. పడమటలంక రోడ్లో రాత్రి బస చేస్తారు. ఇవాళ మొత్తం 10 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేస్తారు.
0 comments:
Post a Comment