అంజిరెడ్డి మృతికి విజయమ్మ సంతాపం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంజిరెడ్డి మృతికి విజయమ్మ సంతాపం

అంజిరెడ్డి మృతికి విజయమ్మ సంతాపం

Written By news on Friday, March 15, 2013 | 3/15/2013


రెడ్డీ ల్యాబ్స్ అధినేత అంజిరెడ్డి మృతికి వైఎస్ విజయమ్మ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అంజిరెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ డాక్టర్ అంజిరెడ్డి శుక్రవారం అపోలో ఆస్పత్రిలో మరణించారు.


డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ అధినేత కళ్లం అంజిరెడ్డి(73) కన్నుమూశారు. అంజిరెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో 1940లో జన్మించారు. 1984లో స్థాపించిన డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ దేశంలో రెండవ అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఎదిగింది. ఆయన ఎంతో శ్రమించి రెడ్డి ల్యాబ్స్ ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఫార్మా రంగంలో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
Share this article :

0 comments: