వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ మహిళా సాధికారిత కోసం వైఎస్ఆర్ పరితపించారన్నారు. ప్రతి మహిళా లక్షాధికారి కావాలని వైఎస్ కలలు కన్నారని ఆమె గుర్తు చేశారు.
మహిళల కోసం వైఎస్ఆర్ వడ్డీలేని రుణ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆయన మరణం తర్వాత ఆ పథకాలన్ని అటకెక్కాయన్నారు. వైఎస్ వారసుడిగా ఆయన పథకాలను జగన్ అమలు చేస్తారని, జగన్ నాయకత్వంలో అందరం ముందుకు సాగుతామని విజయమ్మ పిలుపునిచ్చారు.
గతంలో చంద్రబాబు, ప్రస్తుత కిరణ్ సర్కార్ దొందూ దొందేనని విజయమ్మ వ్యాఖ్యానించారు. అంగన్ వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదని ఆమె అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను విజయమ్మ సన్మానించారు
మహిళల కోసం వైఎస్ఆర్ వడ్డీలేని రుణ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆయన మరణం తర్వాత ఆ పథకాలన్ని అటకెక్కాయన్నారు. వైఎస్ వారసుడిగా ఆయన పథకాలను జగన్ అమలు చేస్తారని, జగన్ నాయకత్వంలో అందరం ముందుకు సాగుతామని విజయమ్మ పిలుపునిచ్చారు.
గతంలో చంద్రబాబు, ప్రస్తుత కిరణ్ సర్కార్ దొందూ దొందేనని విజయమ్మ వ్యాఖ్యానించారు. అంగన్ వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదని ఆమె అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను విజయమ్మ సన్మానించారు
0 comments:
Post a Comment