మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర మంగళవారం సత్తెనపల్లి నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి మంగళవారం ఉదయం బయలు దేరి సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇరుకుపాలెం, మాదల, బొల్లారం క్రాస్రోడ్ మీదుగా మధ్యాహ్న భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడినుంచి చాగంటివారిపాలెం, ముప్పాళ్ల, గొల్లపాడు మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
సత్తెనపల్లి నియోజకవర్గం: ఇరుకుపాలెం, మాదల, బొల్లారం క్రాస్రోడ్, చాగంటివారిపాలెం, ముప్పాళ్ల, గొల్లపాడు
పర్యటించే ప్రాంతాలు
సత్తెనపల్లి నియోజకవర్గం: ఇరుకుపాలెం, మాదల, బొల్లారం క్రాస్రోడ్, చాగంటివారిపాలెం, ముప్పాళ్ల, గొల్లపాడు
0 comments:
Post a Comment