మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర శుక్రవారం గుంటూరు నగరంలో సాగనుందని వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి హౌసింగ్బోర్డు కాలనీ, చుట్టుగుంట, వెంకటప్పయ్యకాలనీ నాలుగోలైన్, మున్సిపల్స్కూల్, వికలాంగుల కాలనీ, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు, అచ్చయ్యదాబా సెంటర్, రామనామక్షేత్రం, నల్లచెరువు వేంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం నల్లచెరువు మెయిన్రోడ్, ఏటుకూరు క్రాస్రోడ్, ఎస్.కె.పి.ఆలయం, పూలమార్కెట్, జిన్నాటవర్ మీదుగా మాయాబజార్సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం పొన్నూరు రోడ్, బీఆర్స్టేడియం, సంగడిగుంట మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
గుంటూరు నగరం: హౌసింగ్బోర్డు కాలనీ, చుట్టుగుంట, వెంకటప్పయ్య కాలనీ 4వలైన్, మున్సిపల్ స్కూల్, వికలాంగుల కాలనీ, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు, అచ్చయ్య దాబా సెంటర్, రామనామక్షేత్రం, నల్లచెరువు వేంకటేశ్వరాలయం, నల్లచెరువు మెయిన్రోడ్, ఏటుకూరు క్రాస్రోడ్, ఎస్కేపీ టెంపుల్, పూలమార్కెట్, జిన్నాటవర్స్, మాయాబజార్ సెంటర్, పొన్నూరు రోడ్, బీఆర్ స్టేడియం, సంగడిగుంట.
పర్యటించే ప్రాంతాలు
గుంటూరు నగరం: హౌసింగ్బోర్డు కాలనీ, చుట్టుగుంట, వెంకటప్పయ్య కాలనీ 4వలైన్, మున్సిపల్ స్కూల్, వికలాంగుల కాలనీ, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు, అచ్చయ్య దాబా సెంటర్, రామనామక్షేత్రం, నల్లచెరువు వేంకటేశ్వరాలయం, నల్లచెరువు మెయిన్రోడ్, ఏటుకూరు క్రాస్రోడ్, ఎస్కేపీ టెంపుల్, పూలమార్కెట్, జిన్నాటవర్స్, మాయాబజార్ సెంటర్, పొన్నూరు రోడ్, బీఆర్ స్టేడియం, సంగడిగుంట.
0 comments:
Post a Comment