జగన్ నినాదాలతో హోరెత్తిన బెల్లంకొండ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ నినాదాలతో హోరెత్తిన బెల్లంకొండ

జగన్ నినాదాలతో హోరెత్తిన బెల్లంకొండ

Written By news on Friday, March 1, 2013 | 3/01/2013

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల బెల్లంకొండ చేరుకున్నారు. బెల్లంకొండలో జనతరంగాలు ఎగిసిపడ్డాయి. జై జగన్‌ నినాదాలతో బెల్లంకొండ హోరెత్తింది. 


కిరణ్ అసమర్థతవల్లే ఈ దుస్థితి: షర్మిల
రాష్ట్రంలో విద్యుత్ కోత వేళలు దారుణంగా పెంచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థత వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈరోజు ఆమె గుంటూరు జిల్లా బెల్లంకొండ గ్రామం చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. నీచమైన కుట్రలు పన్ని జగనన్నపై అబద్దపు కేసులు పెట్టి, జైలు పాలు చేశారన్నారు. కాంగ్రెస్ చేతిలో సిబిఐ కీలుబొమ్మ అని విమర్శించారు. కాంగ్రెస్ వారు, చంద్రబాబు కలిసి రాష్ట్రంలో వేరే పార్టీ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుకు స్వార్థ రాజకీయాలు తప్ప మరేవీ పట్టవన్నారు. 

చంద్రబాబుకు మాట ఇవ్వడం, మాటమీద నిలబడటం తెలియదని విమర్శించారు. బాబు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఎత్తివేశారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ వాగ్దానాన్ని నిలుపుకోలేదన్నారు. బాబు హయాంలోనే బాబ్లీ ప్రాజెక్టు మొదలు పెట్టారని గుర్తు చేశారు. ఆయన అడ్డుకోకపోవడం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు
Share this article :

0 comments: