ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాపక్షం తరఫున నిలబడ్డ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయగలరా అని షర్మిల ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన ఎమ్మెల్యేలపై వేటు వేయగలరా అని పార్టీలను నిలదీశారు. ధైర్యం ఉంటే వారిని సస్పెండ్ చేసి ఎన్నికలకు రాగలరా అని షర్మిల సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తే డిపాజిట్లు కూడా దక్కవని కాంగ్రెస్, టీడీపీకి భయమని షర్మిల ఎద్దేవా చేశారు.
అంతేకాకుండా జగనన్న నిర్దోషి అని ప్రజలు తీర్పిస్తారని భయమని, జగనన్న సీఎం కావాలని ప్రజలు ఎలుగెత్తి చాటుతారని, ఎన్ని ప్రయత్నాలు చేసినా జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యమని షర్మిల అన్నారు.
అంతేకాకుండా జగనన్న నిర్దోషి అని ప్రజలు తీర్పిస్తారని భయమని, జగనన్న సీఎం కావాలని ప్రజలు ఎలుగెత్తి చాటుతారని, ఎన్ని ప్రయత్నాలు చేసినా జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యమని షర్మిల అన్నారు.
0 comments:
Post a Comment