రైతన్నకు నిలువెల్లా గాయాలే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతన్నకు నిలువెల్లా గాయాలే

రైతన్నకు నిలువెల్లా గాయాలే

Written By news on Wednesday, March 6, 2013 | 3/06/2013

వైఎస్సార్ ఉన్నప్పుడు తోక ముడిచిన విత్తన కంపెనీలు ఇప్పుడు జూలు విదిలిస్తున్నాయి
వైఎస్ హయాంలో రూ.650కు తగ్గించిన బిటీ పత్తి విత్తనాలను మళ్లీ పాత ధరకే అమ్ముతున్నారు
చంద్రబాబు వాగ్దానాలు చూస్తుంటే ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నటు’్ల ఉంది
ఆయన తొమ్మిదేళ్ల పరిపాలనలో ప్రజల రక్తం పిండుకొని తాగారు
ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కుమ్మక్కై మళ్లీ ప్రజల ఉసురు పోసుకుంటున్నారు
కుమ్మక్కయ్యారు కాబట్టే అవిశ్వాసం పెట్టడానికి ముందుకు రావడం లేదు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 82, కిలోమీటర్లు: 1,139.6

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నన్ని రోజులూ తోక ముడిచిన విత్తన కంపెనీలు మళ్లీ పల్లెల మీద పడి జూలు విదిలిస్తున్నాయి. పాలకుల చేతగానితనాన్ని ఆసరాగా చేసుకొని రైతులను దోచుకుంటున్నాయి. నకిలీ విత్తన కంపెనీలు విచ్చల విడిగా వస్తున్నాయి. వాటిని నిలువరించాల్సిన ప్రభుత్వం.. చేష్టలుడిగి చూస్తోంది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర సంగతి దేవుడెరుగు.. కనీసం కొనే దిక్కు కూడా లేదు. సీసీఐ అధికారులు దళారులతో కుమ్మక్కై.. పత్తి పంటను నేరుగా దళారుల గుప్పిట్లోకే పంపిస్తున్నారు. ఈ చేతగాని పాలకుల చేతిలో పడి రైతన్నకు నిలువెల్లా గాయాలే కనిపిస్తున్నాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికీ నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సాగింది. 

యాత్రలో సాగుతున్న షర్మిలను చినతుర్కపాలెం గ్రామానికి చెందిన రైతు ఖాజావలి మాదాల గ్రామ శివారులో కలిశాడు. ‘అమ్మా... పిందె దశలో కరెంటు లేకపోవడంతో నీళ్లు రాక కాయ ఎదగలేదు. ఎకరానికి రూ. 40 వేలు పెట్టుబడి పెట్టి పత్తి తీశాను. అది తీసుకొని మార్కెట్‌కు వెళ్లి.. మూడు రోజులుగా అక్కడే ఉంటే.. ఇది గుడ్డి పత్తి అని మార్కెట్ సారోళ్లు కొనబోమని చెప్పారు. ఈ పత్తిని నేను ఏం చేసుకోనమ్మా..’ అని ఖాజావలి ఆవేదన వ్యక్తం చేశారు. మాదాల గ్రామానికి చెందిన మల్లీశ్వరి, రాణి అనే మిరప రైతులు షర్మిలను కలిసి.. ‘అమ్మా మాదల గ్రామంలో నకిలీ విత్తనం ఇచ్చారు. చేనంతా గిడసబారిపోయిందమ్మా... ఇంత ఖర్చు చేసి పంట వేసుకుంటే రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదమ్మా’ అంటూ గిడసబారిన మిరప చెట్లను చూపించి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంలో షర్మిల మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.

వైఎస్సార్ బీటి కంపెనీల మెడలు వంచారు...

అనంతరం చాగంటివారిపాలెంలో షర్మిల మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్ ఉన్నప్పుడు బీటీ విత్తనాల కంపెనీలకు ముకుతాడు వేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో 450 గ్రాముల బీటీ పత్తి విత్తనాలకు రూ. 1,800 ధర ఉండేది. అవి కూడా రైతులకు సరిపోయినన్ని అందుబాబులో ఉంచకుండా ఒకటి.. అర సంచి ఇచ్చి మిగిలినవి బ్లాక్ మార్కెట్‌కు తరలించి అమ్ముకునేవారు. బ్లాక్ మార్కెట్‌లో రూ. 2,500 వరకు అమ్ముకునేవారు. వైఎస్సార్ వచ్చాక బీటీ విత్తనాల ప్యాకెట్ ధరను రూ. 650కు దించారు. రైతులకు ఎన్ని విత్తనాలు కావాల్సి ఉంటే అన్నిటినీ అందుబాటులో ఉంచారు. ఈ విత్తన కంపెనీలు మళ్లీ కిరణ్ పాలనలో జూలు విదులుస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఏ ధరకైతే విత్తనాలు అమ్మారో.. ఈ రోజు కూడా అదే ధరకు విత్తనాలు అమ్ముతున్నారు. అదీ సరిపోలేదని విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటున్నారు. కిరణ్ పాలనకు, బాబు పాలనకు తేడా లేదు. ఇది బాబు పాలన రెండో భాగం’’ అని దుయ్యబట్టారు.

అంధకార ప్రదేశ్‌గా మార్చేశారు...

‘‘వైఎస్సార్ రైతులను గౌరవించారు. వాళ్లను ప్రేమించారు. రైతులకు ప్రతిదీ చేశారు. విత్తనాల ధరలు దించారు. ఎరువుల ధరలు పెరగనివ్వలేదు. ఏడు గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానన్నారు.. ఇచ్చి చూపించారు. ఆయన బతికే ఉంటే ఇవాళ రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చేవారు. కానీ ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఏడు గంటలు కాదు కదా.. మూడు గంటలు కూడా ఇవ్వడం లేదు. వీళ్లు రానురాను ఉచిత విద్యుత్తు కూడా ఎత్తేస్తారేమా’’ అని షర్మిల ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘వైఎస్సార్ రాష్ట్రాన్ని హరితాంధ్ర ప్రదేశ్‌గా మార్చాలని కలలుగంటే ఈ పాలకులు మన రాష్ట్రాన్ని అంధకార ప్రదేశ్‌గా మార్చేశారు. వైఎస్సార్ హయాంలో రైతులంతా వ్యవసాయం చేసి అప్పుల ఊబి నుంచి బయటికి వస్తే ఇప్పుడున్న పాలకులు మళ్లీ రైతన్నలను అప్పుల ఊబిలోకే నెట్టేశారు. అప్పులు కట్టడం కోసం అన్నదాతలు ఇవాళ కిడ్నీలు అమ్ముకుంటున్న దుస్థితిని మనం చూస్తున్నాం’’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు..

‘‘వైఎస్సార్ మండే ఎండా కాలంలో 1,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను చూశారు. వాళ్ల బాధను అర్థం చేసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఏమేం చేయాలో అవి చేస్తానని వాగ్దానాలు చేశారు. ‘రాజశేఖరరెడ్డి.. మీరిచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే పాదయాత్రలు కాదు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయాలి’ అని ఇదే చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇవాళ అదే చంద్రబాబు పల్లెల వెంట తిరుగుతూ వైఎస్ పథకాలను తాను కూడా అమలు చేస్తానని వాగ్దానాలు చేస్తున్నారు. చంద్రబాబు వాగ్దానాలు చూస్తుంటే ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న’ సామెత గుర్తొస్తోంది. ఎన్ని వాతలు పెట్టుకున్నా.. నక్క పులి అవుతుందా..! పేదవాళ్లకు రోగమొస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా యూజర్ చార్జీలు వసూలు చేసిన నీచమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన తొమ్మిదేళ్ల పరిపాలనలో ప్రజల రక్తం పిండుకొని తాగారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కుమ్మక్కై మళ్లీ ప్రజల ఉసురుపోసుకుంటున్నారు. అందుకే కరెంటు చార్జీలు దారుణంగా పెంచేసినా, కోతలతో ప్రజల్ని చీకట్లోకి నెట్టేస్తున్నా, ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి చంద్రబాబు ముందుకు రావడం లేదు’’ అని షర్మిల విమర్శించారు.


మంగళవారం 82వ రోజు పాదయాత్ర ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం నుంచి ప్రారంభమైంది. మాదల, బొల్లారం క్రాస్ రోడ్డు మీదుగా చాగంటివారిపాలెం గ్రామం చేరుకున్న షర్మిల.. అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అక్కడి నుంచి ముప్పాళ్ల మీదుగా గోళ్లపాడు గ్రామం శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మంగళవారం మొత్తం 12.6 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,139.6 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో మర్రి రాజశేఖర్, ఆర్‌కే, జంగా కృష్ణమూర్తి, అంబటి రాంబాబు, ముదునూరి ప్రసాదరాజు, తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, పి.గౌతంరెడ్డి, స్థానిక నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, దేవళ్ల రేవతి, మేరాజోత్ హన్మంతు నాయక్ తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: