కోతలతో చుక్కలు చూపుతున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోతలతో చుక్కలు చూపుతున్నారు

కోతలతో చుక్కలు చూపుతున్నారు

Written By news on Wednesday, March 6, 2013 | 3/06/2013

అడ్డూ అదుపూ లేని కోతలతో ప్రజా జీవనం స్తంభించిపోయిందని ఆవేదన

సాక్షి, హైదరాబాద్: వేసవి రాకముందే కరెంటు కోతలతో ప్రజలకు పాలకులు చుక్కలు చూపుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. అడ్డూ అదుపూలేని కోతల కారణంగా ప్రజా జీవనం స్తంభించిపోయి పగలు, రాత్రి తేడా లేకుండా పూర్తిగా చీకట్లు అలుముకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరాల్లో రెండు గంటల కోత అని ప్రకటించినప్పటికీ.. వాస్తవానికి 4 గంటల అప్రకటిత కోత అమలవుతోందన్నారు. జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుండగా.. గ్రామాల పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్నారు. 

విద్యుత్ కోతలతో రైతులు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారని గట్టు అన్నారు. ఇప్పటి దాకా 25 లక్షల హెక్టార్ల పంట ఎండిపోయిందని, మెట్ట పొలాలు సాగుచేసుకునే చిన్న, సన్నకారు రైతులతో పాటు బడుగు, బలహీనవర్గాలు కోలుకోలేని దెబ్బతిన్నాయని తెలిపారు. వార్షిక పరీక్షలకు విద్యార్థులు సరిగా సన్నద్ధమవలేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నారు. పరిశ్రమలకు 12 రోజులు పవర్ హాలిడే అని చెప్పి, నెలలో సగంరోజులు కూడా సరిగా ఇవ్వడంలేదని, దీంతో ఇప్పటి దాకా 1.80 లక్షల కంపెనీలు మూతపడి, 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోతలు ఇలాగే కొనసాగితే మరో 2 లక్షల కంపెనీలు మూతపడే అవకాశముందని గట్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ వైఫల్యానికి కిరణ్ ప్రభుత్వం బాధ్యత వహించి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

బాబు బినామీ ప్రభాకర్..: బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ టీడీపీ అధినేత చంద్రబాబు బినామీ అని గట్టు ఆరోపించారు. టీడీపీ స్క్రిప్టును బీజేపీ వేదికపై నుంచి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ‘జగన్‌ను అక్రమంగా జైల్లో బంధించాం ఇక ఆ పార్టీ పనైపోతుందని సంబరపడిపోయిన టీడీపీ నేతలకు షర్మిల పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ బెంబేలెత్తిస్తోంది. అందుకే బాబు తన తాబేదార్లను ఉసిగొల్పి షర్మిల భర్తపై అసత్యప్రచారం చేయిస్తున్నారు. బినామీలు మాట్లాడిన రెండు రోజులకు అవే ఆరోపణలను బాబూ చేస్తున్నారు. ఇదంతా పక్కా ప్లాన్‌తో నడిపిస్తున్న కుట్ర’ అని అన్నారు. 
Share this article :

0 comments: