ఈ ప్రభుత్వాన్ని ఎంతమంది కాపాడటానికి ప్రయత్నించినా ఎక్కువ కాలం నిలవదని, త్వరలోనే పడిపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. మరో ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈ సాయంత్రం ఆమె వేజండ్ల గ్రామం చేరుకున్నారు. చేరుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 గంటలకు జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ మట్టికొట్టుకుపోయే రోజు చాలా దగ్గరలోనే ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కైనా నిలబడలేవన్నారు. ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసం పెడితే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం పాలకవర్గానికి మద్దతిచ్చాడని, ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు.
ప్రజలు జగనన్ననే సీఎం అని ఎప్పుడో నిర్ణయించుకున్నారని చెప్పారు. జగనన్న రాజన్న కన్న కలలు నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. ఆ రోజు వచ్చేవరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని కోరారు.
ప్రజలు జగనన్ననే సీఎం అని ఎప్పుడో నిర్ణయించుకున్నారని చెప్పారు. జగనన్న రాజన్న కన్న కలలు నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. ఆ రోజు వచ్చేవరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని కోరారు.
0 comments:
Post a Comment