వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి దోషి అని ఏ కోర్టు చెప్పిందని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత విజయమ్మ ప్రశ్నించారు. శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే సందర్భంలో ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మోత్కుపల్లి నరసింహులు చేసి వ్యాఖ్యలపై మండిపడ్డారు. వైఎస్ఆర్, జగన్ దోషులని ఏ కోర్టు చెప్పింది? అని ప్రశ్నించారు. సభ్యతా, సంస్కారం లేకుండా మాట్లాడారన్నారు. చంద్రబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. తాను చంద్రబాబు విధానాల గురించి మాట్లాడాను. ఆయన అవిశ్వాసానికి ఎందుకు మద్దతు తెలపడంలేదో
మాట్లాడనని చెప్పారు. తాము అవిశ్వాసం ఎందుకు పెట్టామో చెప్పానన్నారు. తాను చంద్రబాబు గురించి మాట్లాడవలసి వస్తే చాలా ఉన్నాయన్నారు. చిదంబరంతో చంద్రబాబు చీకటి ఒప్పందం, ఎఫ్ డిఐలపై ఓటింగ్ అంశం మాట్లాడాలవలసి ఉంటుందన్నారు.
తన బైబిల్ గురించి సభలో ఎందుకు మాట్లాడారని ఆమె ప్రశ్నించారు. సభలోకి దేవుడిని ఎందుకు లాగుతున్నారని అడిగారు
మాట్లాడనని చెప్పారు. తాము అవిశ్వాసం ఎందుకు పెట్టామో చెప్పానన్నారు. తాను చంద్రబాబు గురించి మాట్లాడవలసి వస్తే చాలా ఉన్నాయన్నారు. చిదంబరంతో చంద్రబాబు చీకటి ఒప్పందం, ఎఫ్ డిఐలపై ఓటింగ్ అంశం మాట్లాడాలవలసి ఉంటుందన్నారు.
తన బైబిల్ గురించి సభలో ఎందుకు మాట్లాడారని ఆమె ప్రశ్నించారు. సభలోకి దేవుడిని ఎందుకు లాగుతున్నారని అడిగారు
0 comments:
Post a Comment