అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని షర్మిల విమర్శించారు. ప్రజల సమస్యల గురించి ఆయన ఏనాడు పట్టించుకోలేదని అన్నారు. పాదయాత్రలో భాగంగా రాణిగారితోటలో జరిగిన బహిరంగసభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. మోసాలకు, అసత్యాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారని అన్నారు. కిరణ్ సీల్డ్ కవర్ సీఎం అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆయన తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.
ఓదార్పుయాత్ర చేస్తానని ఇచ్చిన ఒక్కమాట జగనన్న జీవితాన్నే మార్చేసిందన్నారు. ఓదార్పుయాత్ర చేస్తే కాంగ్రెస్ అధిష్టానం రాజకీయంగా ఎదగనివ్వదని చెప్పినా జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడ్డారని గుర్తు చేశారు. రాజకీయాలు లేకపోయినా ఫర్వాలేదు గానీ, మాట నిలబెట్టుకోకపోతే రాజన్న కొడుకును ఎలా అవుతానని జగనన్న అన్నారని షర్మిల చెప్పారు. అందుకే జగనన్నపై కాంగ్రెస్ కక్ష కట్టిందని అన్నారు. త్వరలో బయటకు వచ్చి రాజన్న రాజ్యం దిశగా జగనన్న నడిపిస్తాడని భరోసా ఇచ్చారు
ఓదార్పుయాత్ర చేస్తానని ఇచ్చిన ఒక్కమాట జగనన్న జీవితాన్నే మార్చేసిందన్నారు. ఓదార్పుయాత్ర చేస్తే కాంగ్రెస్ అధిష్టానం రాజకీయంగా ఎదగనివ్వదని చెప్పినా జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడ్డారని గుర్తు చేశారు. రాజకీయాలు లేకపోయినా ఫర్వాలేదు గానీ, మాట నిలబెట్టుకోకపోతే రాజన్న కొడుకును ఎలా అవుతానని జగనన్న అన్నారని షర్మిల చెప్పారు. అందుకే జగనన్నపై కాంగ్రెస్ కక్ష కట్టిందని అన్నారు. త్వరలో బయటకు వచ్చి రాజన్న రాజ్యం దిశగా జగనన్న నడిపిస్తాడని భరోసా ఇచ్చారు
0 comments:
Post a Comment