వైఎస్‌ఆర్ స్మృతివనం నిర్వహణకు కమిటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్ స్మృతివనం నిర్వహణకు కమిటీ

వైఎస్‌ఆర్ స్మృతివనం నిర్వహణకు కమిటీ

Written By ysrcongress on Friday, March 22, 2013 | 3/22/2013

కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని వెలుగోడు రిజర్వ్‌ఫారెస్టులో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతి వనం ప్రాజెక్టు నిర్వహణ, పనుల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శామ్యూల్ గరువారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు కలెక్టరు అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్ ఫీల్డ్ డెరైక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగాను, కర్నూలు రెవెన్యూ డివిజినల్ అధికారి, నంద్యాల రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు, కర్నూలు ఉద్యాన శాఖ ఉప సంచాలకులు, ఆత్మకూరు వన్యప్రాణి సంరక్షణ విభాగం డివిజినల్ ఫారెస్ట్ అధికారి సభ్యులు. 
Share this article :

0 comments: