విద్యుత్ కోతలపై వైఎస్ఆర్ సీపీ నిరసన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్ కోతలపై వైఎస్ఆర్ సీపీ నిరసన

విద్యుత్ కోతలపై వైఎస్ఆర్ సీపీ నిరసన

Written By news on Monday, March 4, 2013 | 3/04/2013

 పెంచిన విద్యుత్ ఛార్జీలు, కరెంట్ కోతలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరుగుతున్న ధర్నాలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సమస్య తలెత్తిందన్నారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ వైఖరిపై షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Share this article :

0 comments: