జనసంద్రమైన సత్తెనపల్లి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనసంద్రమైన సత్తెనపల్లి

జనసంద్రమైన సత్తెనపల్లి

Written By news on Monday, March 4, 2013 | 3/04/2013

 విద్యుత్ చార్జీల పెంపు, కరెంట్ కోతలకు నిరసనగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాకు జనం పోటెత్తారు. సామాన్యుడి గోడు పట్టని సర్కారు తీరును నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని, కరెంట్ కోతలను తగ్గించాలని నినదించారు. ఎండను సైతం లెక్కచేయకుండా భారీగా తరలివచ్చిన జనంతో సత్తెనపల్లి జన సంద్రాన్ని తలపించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె తనయ షర్మిల, ఇతర నేతలు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: