విజయమ్మను కలిసిన వామపక్ష నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మను కలిసిన వామపక్ష నేతలు

విజయమ్మను కలిసిన వామపక్ష నేతలు

Written By news on Thursday, March 28, 2013 | 3/28/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను గురువారం లోటస్ పాండ్లో వామపక్ష నేతలు కలిశారు. విద్యుత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తాము చేస్తున్న విద్యుత్‌ ఉద్యమానికి అండగా నిలవాలని అభ్యర్థించారు. సీపీఎం నేత వై.వెంకటేశ్వరరావు, సీపీఐ నాయకుడు అజీజ్‌పాషా, ఆర్ఎస్పీ నేత జానకిరాములు విజయమ్మతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. 

పెరిగిన విద్యుత్‌ కోతలు, సర్‌ఛార్జ్‌ భారం తగ్గించాలని ఏడు వామపక్ష పార్టీల నేతలు అయిదు రోజులపాటు ఇందిరాపార్క్‌లో ధర్నా చేసిన విషయం తెలిసిందే. పోలీసులు దీక్షను భగ్నం చేయడంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాడాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా పార్టీల నేతలను కలుస్తున్నారు. ఇందులో భాగంగానే విజయమ్మతో సమావేశయ్యారు. కాగా విద్యుత్ కోతలు, సర్‌చార్జీల భారానికి నిరసనగా వచ్చే నెల 9వ తేదీన పది వామపక్ష పార్టీలు రాష్ట్రబంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిం
Share this article :

0 comments: