వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు, లోక్సత్తా , నాగం జనార్ధన రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షం మద్దతు తెలుపకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. డివిజన్ ఓటింగ్ కు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. అవిశ్వాసానికి అనుకూలంగా మద్దాల రాజేష్, పేర్నినాని, పెద్దిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవి, అమరనాథ్ రెడ్డి, సాయిరాజ్, జోగి రమేశ్, సుజయ్ రంగారావు, కొడాలి నాని, వనిత, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆళ్లనాని ఓటు వేశారు. దాంతో శాసనసభలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. కాంగ్రెస్ వ్యతిరేకంగా తొమ్మిదిమంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అవిశ్వాసానికి అనుకూలంగా మొత్తం 57 మంది ఓటు వేశారు. టీడీపీ కి చెందని ఆరుగురు ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించారు. రెబెల్ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, కోటం, వేణుగోపాల చారి ఓటింగ్ దూరంగా ఉన్నారు.
Home »
» వీగిన అవిశ్వాస తీర్మానం
వీగిన అవిశ్వాస తీర్మానం
Written By news on Saturday, March 16, 2013 | 3/16/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment