జగన్మోహన రెడ్డిపై కావాలని దుష్ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్మోహన రెడ్డిపై కావాలని దుష్ప్రచారం

జగన్మోహన రెడ్డిపై కావాలని దుష్ప్రచారం

Written By news on Saturday, March 30, 2013 | 3/30/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. జగన్‌పై ఒక పత్రిక, ఒక చానెల్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయన్నారు. జగన్‌ను ఈడీ అరెస్టు చేస్తుందని అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 40, 50 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆ ఎమ్మెల్యేలను ఆపుకోవడానికే ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారన్నారు. ఆ పత్రిక కిరణ్ పత్రిక, కిరణ్ న్యూస్ అని పెట్టుకుంటే బాగుంటుందన్నారు. 

వైఎస్ఆర్ సిపి నేత సోమయాజులుపై సిబిఐ దర్యాప్తు చేయాలని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, ఆ మాటలు వారి అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. టీడీపీపై ఆయన సందించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, సీబీఐ దర్యాప్తు చేయాలనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. టీడీపీకి దమ్ము, ధైర్యముంటే దర్యాప్తుకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకు నచ్చిన ఆర్థికవేత్త రంగరాజన్‌తో దర్యాప్తు చేయించినా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రైతుల పట్ల చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
Share this article :

0 comments: