'వైఎస్ ఎవరి నాయకుడో ప్రజలే తేలుస్తారు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'వైఎస్ ఎవరి నాయకుడో ప్రజలే తేలుస్తారు'

'వైఎస్ ఎవరి నాయకుడో ప్రజలే తేలుస్తారు'

Written By news on Monday, March 25, 2013 | 3/25/2013

మంత్రి పార్థసారథిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మండిపడ్డారు. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదన్న నిబంధన మంత్రికి తెలియదా అని పార్ధసారథిని ప్రశ్నించారు. అసెంబ్లీలో వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి మాట్లాడటం సరికాదని శోభనాగిరెడ్డి అన్నారు. 

జగనే తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుని 2 ఎంపీలు, 17 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నామని ఆమె తెలిపారు. అధికారంలో ఉండి కూడా సొంతపార్టీ ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేని దుస్థితి కాంగ్రెస్‌ది అని ధ్వజమెత్తారు. దమ్ముంటే ఇప్పుడైనా సరే ఎన్నికలకు రండి.. వైఎస్‌ ఎవరి నాయకుడో ప్రజలే తేలుస్తారని వైఎస్‌ఆర్‌ సీపీ నేత శోభానాగిరెడ్డి సవాల్ విసిరారు. 

రాష్ట్రప్రజలను మహానేత వైఎస్‌ఆర్ కన్నబిడ్డల్లా చూసుకున్నారని మరో ప్రజాప్రస్థానం యాత్రలో షర్మిల అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముగ్గురు సీఎంలలో వైఎస్ఆరే ప్రజాసేవకు అంకితమయ్యారని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయకుడు అయ్యాడని అన్నారు. కాంగ్రెస్‌కు అండగా నిలిచింది చంద్రబాబేనని, అందుకే అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకలేదని ఆయన అన్నారు. 
Share this article :

0 comments: