విద్యుత్ కోతల వల్ల ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోలేదన్న సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. సీఎం సొంత నియోజకవర్గం పీలేరు నుంచే పోరాటం మొదలు పెడదామని, ఎన్ని ఎకరాలు ఎండిపోయాయో తెలుస్తుందన్నారు.
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఇందిరాపార్క్ వద్ద వామపక్ష నేతలు చేస్తున్న దీక్షకు విజయమ్మ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో టీడీపీ హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై వైఎస్సార్, కమ్యూనిస్టులు కలిసి ఉద్యమం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా కలిసి చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఇందిరాపార్క్ వద్ద వామపక్ష నేతలు చేస్తున్న దీక్షకు విజయమ్మ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో టీడీపీ హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై వైఎస్సార్, కమ్యూనిస్టులు కలిసి ఉద్యమం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా కలిసి చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
0 comments:
Post a Comment