వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు అమలు చేయటం ఆయన తనయుడు వైఎస్ జగన్ వల్లే సాధ్యమని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారం చంచల్ గూడ జైల్లో జగన్ ను కలిశారు. భేటీ అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ కాంగ్రెస్ కుమ్మక్కై జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టారన్నారు.
వచ్చే నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే వ్యతిరేకంగా ఓటు వేస్తానని పెద్దిరెడ్డి తెలిపారు
వచ్చే నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే వ్యతిరేకంగా ఓటు వేస్తానని పెద్దిరెడ్డి తెలిపారు
0 comments:
Post a Comment