రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒంటరిగానే పోటీచేసి 200పైగా అసెంబ్లీ, 30పైగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండ లం వంగరలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీలోకి వచ్చినప్పటికీ వారిపై స్పీకర్ అన్హరత వేటు వేయడం లేదన్నారు. ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయం ఆయా పార్టీలకు ఉందన్నారు. పార్టీలకతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుచేతుల్లో ఉండడం బాధాకరమన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాల్సిన ప్రతిపక్ష టీడీపీ అధికార పార్టీతో కలిసిపోవడం దారుణమన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమవుతోందని చెప్పారు. ముందుస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, ఇందుకు వైఎస్సార్సీపీ సిద్ధం గా ఉందన్నారు. కేంద్రంలో ఏ పార్టీకీ మెజారిటీ రాదని, అప్పుడు వైఎస్సార్సీపీ ఎంపీ లే కీలకం అవుతారన్నారు.బీజేపీతోసైతం తెలంగాణ వచ్చే అవకాశం లేదని చెప్పారు
Home »
» వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే గెలుపు
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే గెలుపు
Written By news on Saturday, March 9, 2013 | 3/09/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment