వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయన పాలనలో రైతే రాజు అని మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ లో గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్ధన్ మాట్లాడుతూ భూకొనుగోలు పథకంలో అర్హులైనవారికి అయిదు ఎకరాల భూమి ఇస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాపాడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత కొణతాల రామకృష్ణ విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణమయ్యారన్నారు. దివంగత మహానేత ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారని గుర్తు చేశారు. అవసరమైతే కొనుగోలు చేసి విద్యుత్ అందించారని చెప్పారు.
|
0 comments:
Post a Comment