యూపీఏ సర్కార్ నుంచి డీఎంకే వైదొలిగింది. శ్రీలంకలో తమిళుల వ్యవహారంపై యూపీఏ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్టు డీఎంకే మంగళవారం ప్రకటించింది. డీఎంకేకు చెందిన ఐదుగురు మంత్రులు కేంద్ర కేబినెట్ నుంచి రాజీనామా చేస్తారని పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ప్రకటించారు.
ఈరోజు సాయంత్రం మంత్రులు రాజీనామా లేఖల్ని ప్రధానికి అందజేసే అవకాశం ఉంది. చెన్నైలో ఏర్పాటు చేసిన పార్టీ అత్యవసర సమావేశంలో డీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది. డీఎంకే నిర్ణయంతో యూపీఎ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. లోక్సభలో డీఎంకేకు 18మంది ఎంపీలున్నారు. డీఎంకే వైదొలగటంతో యూపీఏ బలం 230కి పడిపోయింది. -
ఈరోజు సాయంత్రం మంత్రులు రాజీనామా లేఖల్ని ప్రధానికి అందజేసే అవకాశం ఉంది. చెన్నైలో ఏర్పాటు చేసిన పార్టీ అత్యవసర సమావేశంలో డీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది. డీఎంకే నిర్ణయంతో యూపీఎ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. లోక్సభలో డీఎంకేకు 18మంది ఎంపీలున్నారు. డీఎంకే వైదొలగటంతో యూపీఏ బలం 230కి పడిపోయింది. -
0 comments:
Post a Comment