ప్రజాదరణను ఓర్వలేకే అనిల్‌పై కుట్రలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాదరణను ఓర్వలేకే అనిల్‌పై కుట్రలు

ప్రజాదరణను ఓర్వలేకే అనిల్‌పై కుట్రలు

Written By news on Tuesday, March 5, 2013 | 3/05/2013


 షర్మిల పాదయాత్రకు లభిస్తున్న జనాదరణను చూసి ఓర్వలేకే ఆమె భర్త అనిల్‌కుమార్‌పై కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నుతున్నాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత, ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. సోమవారం ఆమె కర్నూలు జిల్లా చాగలమర్రిలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సీపీని ఎదుర్కోలేక దైవ ప్రచారకులైన అనిల్‌ను లక్ష్యంగా ఆ రెండు పార్టీల నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. ఇలాంటి చేతకాని రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఎన్నికలు వస్తే తగిన గుణపాఠం చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనే విషయాన్నే ప్రజలు మరిచిపోయే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటకు వస్తే ఉనికి కోల్పోతామనే భయంతో కాంగ్రెస్, టీడీపీలు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. టీడీపీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని.. కేవలం అధికారమే ధ్యేయంగా చంద్రబాబునాయుడు పాదయాత్ర కొనసాగిస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రజాదరణ ఉన్నంత కాలం వైఎస్‌ఆర్‌సీపీని ఎవరూ అడ్డుకోలేరన్నారు.
Share this article :

0 comments: