సోలార్ విద్యుత్ కొనుగోలు టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల ఖజానాకు రూ.రెండువేల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ఆరోపించారు. ఈ టెండర్ల వ్యవహారంలో అధికారపార్టీ, ప్రధాన ప్రతిపక్షం(టీడీపీ) రెండూ మిలాఖత్ అయ్యాయని, కొందరు పెద్దలకు రూ.600 కోట్లు ముడుపులు అందాయని ఆయన పేర్కొన్నారు. ఈ కుంభకోణం బాగోతం బయటపడాలంటే టెండర్లకు సంబంధించిన ఫైళ్లను శాసనసభ ముందుంచాలని డిమాండ్ చేశారు. భూమన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్పత్తికి ఏమాత్రం సంబంధంలేని ట్రాన్స్కో టెండర్లు పిలవడంలో ఉన్న మతలబేంటని ప్రశ్నించారు. సౌర విద్యుత్ టెండర్లలో జెన్కోను భాగస్వామ్యం చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
Home »
» సోలార్ టెండర్లలో భారీ కుంభకోణం: భూమన
సోలార్ టెండర్లలో భారీ కుంభకోణం: భూమన
Written By ysrcongress on Friday, March 22, 2013 | 3/22/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment