జగనన్న త్వరలోనే బయటకు వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ప్రజలకు హామీ ఇచ్చారు. జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె ఈరోజు రెడ్డిగూడెం గ్రామం చేరుకున్నారు. గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు రానున్నాయన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ఆర్దేనని చెప్పారు. ఎరువుల ధరలు తగ్గించి రైతులను ఆదుకున్నది కూడా వైఎస్ఆరేనని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని గతంలో చంద్రబాబు విమర్శించారన్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చి వైఎస్ఆర్ మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యుత్ కష్టాలు వచ్చాయన్నారు. విద్యుత్ కోతలతో రైతులు, పరిశ్రమల యజమానులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అవిశ్వాసం పెట్టమంటే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని షర్మిల విమర్శించారు.
Home »
» జగనన్న త్వరలో బయటకువస్తారు:షర్మిల
జగనన్న త్వరలో బయటకువస్తారు:షర్మిల
Written By news on Saturday, March 2, 2013 | 3/02/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment