వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ కన్వీనర్గా మాజీ ఎంపీ డి.రవీంద్ర నాయక్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. రవీంద్ర నాయక్ ఇప్పటికే పార్టీ పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు. ఆయన దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కొంతకాలం రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తెలంగాణలోని ఎరుకుల, లంబాడాలను ఎస్టీలుగా గుర్తింపజేసేందుకు జాతీయ స్థాయిలో కృషి చేశారు
.
.
0 comments:
Post a Comment