ఎన్నికలంటే చంద్రబాబు భయపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. ఆమె శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థతను చట్టసభల్లో నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ డ్రామాలాడుతోందని ఆరోపించారు.
విద్యుత్ కోతలపై విపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తే ప్రధాన ప్రతిపక్ష అధినేత చంద్రబాబు తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడం కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. టీడీపీ విప్ జారీ చేసి కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతిస్తోందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయటానికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారని శోభానాగిరెడ్డి తెలిపారు
విద్యుత్ కోతలపై విపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తే ప్రధాన ప్రతిపక్ష అధినేత చంద్రబాబు తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడం కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. టీడీపీ విప్ జారీ చేసి కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతిస్తోందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయటానికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారని శోభానాగిరెడ్డి తెలిపారు
0 comments:
Post a Comment