ప్రజలు బ్రహ్మరథం పట్టగానే...పాలకులకు ముచ్చెమటలు పట్టాయి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలు బ్రహ్మరథం పట్టగానే...పాలకులకు ముచ్చెమటలు పట్టాయి!

ప్రజలు బ్రహ్మరథం పట్టగానే...పాలకులకు ముచ్చెమటలు పట్టాయి!

Written By news on Saturday, March 30, 2013 | 3/30/2013


రాజశేఖరరెడ్డిగారి పాలనాదక్షత గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఈ రాష్ట్రంలో తెలియనివారు లేరు. ఆయన ఈనాటికీ మన మధ్యన ఉండి ఉంటే ఆయన కోరుకున్న విధంగా, ప్రతి పౌరుడు ఆశించిన విధంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారి ఉండేది. కానీ మన దురదృష్టం. వైఎస్సార్ చేసిన మంచి పనులను చూసి, తనకు సహాయకుడిగా ఉంటే బాగుండునని దేవుడే అకస్మాత్తుగా ఇంతపని చేశాడనిపిస్తుంది!

వైఎస్సార్ చనిపోయి ఇన్నిరోజులైనా ఆయనను అభిమానించే, ఆరాధించే ప్రతి వ్యక్తి హృదయం నేటికీ ఆవేదన చెందుతూనే ఉంది. ఆ ఆవేదనను తీర్చేందుకు, ఓదార్చేందుకు ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ప్రతిప్రాంతమూ బ్రహ్మరథం పట్టింది. ఇప్పటివరకూ ఆ యువనాయకుడి పరిపాలన చూడకపోయినా, ఎందుకో అతడిపై ఒక దృఢనమ్మకం ప్రజల్లో ఏర్పడింది.

కచ్చితంగా అతడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్థుడని, తండ్రిని మరిపించేలా జనాభ్యుదయం కోసం పాటుపడతాడని సంతోషపడ్డారు. అయితే కాంగ్రెస్‌పార్టీ జగన్‌ను జైల్లో వేయించి, బెయిల్ రాకుండా అవరోధాలు కల్పిస్తోంది. ఈ విషయం రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది. మా నుంచి జగన్‌ని దూరం చేశామని ఈ కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు క్షణికానందం పొందుతున్నారు తప్ప రాబోయే రోజుల్లో తమకు పట్టబోయే దుర్గతి గురించి ఆలోచించడం లేదు. ప్రజల అభిమానం, రాజశేఖర్‌రెడ్డి చల్లని దీవెనలు ఉన్నంతవరకు జగన్‌బాబు కాలి ధూళిని కూడా ఎవరూ తాకలేరనే వాస్తవం ఈ కుటిలనాయకులు గమనించాలి.

- ఎస్.పార్వతి, పార్వతీపురం, విజయనగరం
Share this article :

0 comments: