వైఎస్ఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ తక్షణమే వైఎస్ కుటుంబానికి సర్వే క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, శ్రీనివాసులు, సుచరిత హెచ్చరించారు.
వైఎస్ మరణంపై నీచంగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఇందిర, రాజీవ్ హత్యలపై మాట్లాడటానికి తమకు సంస్కారం అడ్డొస్తుందన్నారు. ఇంకా ఏమైనా పదవులు కావాలంటే సోనియా కాళ్లు పట్టుకుని భజన చేసుకో తప్పా వైఎస్ఆర్ను విమర్శిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సర్వేకు దమ్ముంటే రాజీనామా చేసి సోనియా బొమ్మతో ఎన్నికలు రావాలని సవాల్ విసిరారు. తాము వైఎస్ఆర్ బొమ్మతో పోటీ చేస్తామన, ప్రజలు ఎవర్ని గెలిపిస్తారో చూద్దామన్నారు.
వైఎస్ మరణంపై నీచంగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఇందిర, రాజీవ్ హత్యలపై మాట్లాడటానికి తమకు సంస్కారం అడ్డొస్తుందన్నారు. ఇంకా ఏమైనా పదవులు కావాలంటే సోనియా కాళ్లు పట్టుకుని భజన చేసుకో తప్పా వైఎస్ఆర్ను విమర్శిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సర్వేకు దమ్ముంటే రాజీనామా చేసి సోనియా బొమ్మతో ఎన్నికలు రావాలని సవాల్ విసిరారు. తాము వైఎస్ఆర్ బొమ్మతో పోటీ చేస్తామన, ప్రజలు ఎవర్ని గెలిపిస్తారో చూద్దామన్నారు.
0 comments:
Post a Comment