పేదలను ఆదుకుంటాం
పార్టీ సీజీసీ సభ్యురాలు కొండా సురేఖ
హన్మకొండ: రాజన్న ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాలను అమలు చేయడం, ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం ఆవిర్భవించిన పార్టీయే వైఎ స్సార్ సీపీ అని మాజీ మంత్రి, పార్టీ సీజీసీ సభ్యురాలు కొండా సురేఖ అన్నారు. వరంగల్లోని అన్నపూర్ణేశ్వరి గార్డెన్లో పార్టీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ముఖ్య అతి థిగా కొండా సురేఖ హాజరై మాట్లాడారు. పార్టీ పటిష్టత కోసం సభ్యత్వ నమోదు, అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన తీరును నాయకులు, కార్యకర్తలకు వివరించారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సుస్థిర పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగన్మోహన్రెడ్డి నాయకత్వం కావాలని ఆమె సూచించారు. పార్టీ పటిష్టత కోసం ప్రతిఒక్కరూ తీవ్రంగా కృషి చేయాలన్నారు. సభ్యత్వ నమోదులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అందరూ కష్టపడితే రాబోయే కాలం వైఎస్సార్ సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టత కోసం మండలాలు, నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిశీలకులను నియమిస్తున్నట్లు ఆమె తెలిపారు.
పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బొజ్జపెల్లి
అనంతరం కొండా దంపతుల ఆహ్వానం మేరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొజ్జపెల్లి రాజయ్య వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. ఆయనతోపాటు వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు సురేఖ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ టీడీపీలో అణచివేత ధోరణి అధికంగా ఉందన్నారు. అది నచ్చకనే వైఎస్సార్ సీపీలో చేరినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ టి.రమేష్బాబు, కేకే.మహేందర్రెడ్డి, తక్కెళ్లపల్లి రాము, మదన్లాల్, బండి పుల్లయ్య, భీంరెడ్డి సుధీర్రెడ్డి, నూనావత్ రాధ తదితరులతోపాటు వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ సీజీసీ సభ్యురాలు కొండా సురేఖ
హన్మకొండ: రాజన్న ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాలను అమలు చేయడం, ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం ఆవిర్భవించిన పార్టీయే వైఎ స్సార్ సీపీ అని మాజీ మంత్రి, పార్టీ సీజీసీ సభ్యురాలు కొండా సురేఖ అన్నారు. వరంగల్లోని అన్నపూర్ణేశ్వరి గార్డెన్లో పార్టీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ముఖ్య అతి థిగా కొండా సురేఖ హాజరై మాట్లాడారు. పార్టీ పటిష్టత కోసం సభ్యత్వ నమోదు, అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన తీరును నాయకులు, కార్యకర్తలకు వివరించారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సుస్థిర పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగన్మోహన్రెడ్డి నాయకత్వం కావాలని ఆమె సూచించారు. పార్టీ పటిష్టత కోసం ప్రతిఒక్కరూ తీవ్రంగా కృషి చేయాలన్నారు. సభ్యత్వ నమోదులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అందరూ కష్టపడితే రాబోయే కాలం వైఎస్సార్ సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టత కోసం మండలాలు, నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిశీలకులను నియమిస్తున్నట్లు ఆమె తెలిపారు.
పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బొజ్జపెల్లి
అనంతరం కొండా దంపతుల ఆహ్వానం మేరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొజ్జపెల్లి రాజయ్య వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. ఆయనతోపాటు వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు సురేఖ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ టీడీపీలో అణచివేత ధోరణి అధికంగా ఉందన్నారు. అది నచ్చకనే వైఎస్సార్ సీపీలో చేరినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ టి.రమేష్బాబు, కేకే.మహేందర్రెడ్డి, తక్కెళ్లపల్లి రాము, మదన్లాల్, బండి పుల్లయ్య, భీంరెడ్డి సుధీర్రెడ్డి, నూనావత్ రాధ తదితరులతోపాటు వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment