రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వైఎస్ షర్మిల అన్నారు. మహిళ గర్వంగా తలెత్తుకునే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదని ఆమె వ్యాఖ్యానించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె శుక్రవారం తుబాడ ఎస్సీ కాలనీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మహిళలకు మరుగుదొడ్లు కట్టిస్తామని... కాంగ్రెస్ పెద్దలే ఆ డబ్బులు దోచుకుంటున్నారని మండిపడ్డారు.
మహిళల విషయంలో చంద్రబాబు అదే వైఖరి అనుసరించేవారన్నారు. రంగారెడ్డి జిల్లాలో యాసిడ్ దాడికి గురైన యువతి విషయంలో అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబుకు కోర్టు అక్షింతలు కూడా వేసిందన్నారు. అయినా బాబు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పాదయాత్రలో భాగంగా షర్మిల తుబాడులో మహానేత వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు
మహిళల విషయంలో చంద్రబాబు అదే వైఖరి అనుసరించేవారన్నారు. రంగారెడ్డి జిల్లాలో యాసిడ్ దాడికి గురైన యువతి విషయంలో అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబుకు కోర్టు అక్షింతలు కూడా వేసిందన్నారు. అయినా బాబు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పాదయాత్రలో భాగంగా షర్మిల తుబాడులో మహానేత వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు
0 comments:
Post a Comment