వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మరోప్రస్థానం పాదయాత్ర 85వరోజు నాదెండ్లలో ముగిసింది. ఇప్పటివరకు ఆమె 1177.4 కిలోమీటర్లు నడిచారు.
మహానేత వైఎస్ఆర్ మహిళల్ని సొంత అక్కాచెల్లెళ్లలాగ చూసుకున్నారని గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నాదెండ్ల ఎస్సీ కాలనీలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల అన్నారు. మహిళలంటే చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డిలకు గౌరవం లేదని షర్మిల ఆరోపించారు. మహిళా దినోత్సవం రోజున మహిళలు గర్వించే పరిస్థితి ప్రస్తుతం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు సరియైన మరుగుదొడ్లు లేవని, పావలావడ్డీ రెండు రూపాయలు అయిందని షర్మిల అన్నారు.
మహిళలు తాళిబొట్లు తాకట్టుపెట్టుకుని రుణాలు తీర్చుకునే పరిస్థితి ప్రస్తుత పాలనలో తలెత్తిందని షర్మిల అన్నారు. జగనన్న విడుదల కోసం హైదరాబాద్కు నడిసివస్తామన్న ఎస్సీ కాలనీ మహిళలు అన్నారు. జగనన్నను త్వరగా బయటకు తీసుకురావాలని షర్మిలకు ఎస్సీ కాలనీ మహిళల విజ్ఞప్తి చేశారు.
మహానేత వైఎస్ఆర్ మహిళల్ని సొంత అక్కాచెల్లెళ్లలాగ చూసుకున్నారని గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నాదెండ్ల ఎస్సీ కాలనీలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల అన్నారు. మహిళలంటే చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డిలకు గౌరవం లేదని షర్మిల ఆరోపించారు. మహిళా దినోత్సవం రోజున మహిళలు గర్వించే పరిస్థితి ప్రస్తుతం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు సరియైన మరుగుదొడ్లు లేవని, పావలావడ్డీ రెండు రూపాయలు అయిందని షర్మిల అన్నారు.
మహిళలు తాళిబొట్లు తాకట్టుపెట్టుకుని రుణాలు తీర్చుకునే పరిస్థితి ప్రస్తుత పాలనలో తలెత్తిందని షర్మిల అన్నారు. జగనన్న విడుదల కోసం హైదరాబాద్కు నడిసివస్తామన్న ఎస్సీ కాలనీ మహిళలు అన్నారు. జగనన్నను త్వరగా బయటకు తీసుకురావాలని షర్మిలకు ఎస్సీ కాలనీ మహిళల విజ్ఞప్తి చేశారు.
0 comments:
Post a Comment