షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు 1,500 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించింది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వద్దకు చేరుకున్న షర్మిల 1,500 కిలోమీటర్ల యాత్ర పూర్తిచేశారు. దీనికి చిహ్నంగా పెడనలో 18 అడుగుల వైఎస్సార్ భారీ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వంద మంది వికలాంగులకు ట్రైసైకిళ్లను షర్మిల చేతుల మీదుగా పంపిణీ చేశారు.
Home »
» 1500 కి.మీ. దాటిన షర్మిల పాదయాత్ర
1500 కి.మీ. దాటిన షర్మిల పాదయాత్ర
Written By news on Wednesday, April 3, 2013 | 4/03/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment