వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి చంచల్ గూడ జైల్లో కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నానంటే వైఎస్ ఆర్, జగన్ భిక్షేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించినందువల్లే అసెంబ్లీలో అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేసినట్లు తెలిపారు.
టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నాయని శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ పథకాలు మరోసారి అమల్లోకి రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ గెలుపు కోసం సామాన్య కార్యకర్తగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రైతులను విస్మరించి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ జెండా మూసుకోవాల్సిందేనని అన్నారు. తమ కుటుంబం వైఎస్ఆర్ ఆశయాల కోసం ఎల్లప్పుడు పనిచేస్తూనే ఉంటుందని శివప్రసాద్ రెడ్డి తెలిపారు.
టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నాయని శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ పథకాలు మరోసారి అమల్లోకి రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ గెలుపు కోసం సామాన్య కార్యకర్తగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రైతులను విస్మరించి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ జెండా మూసుకోవాల్సిందేనని అన్నారు. తమ కుటుంబం వైఎస్ఆర్ ఆశయాల కోసం ఎల్లప్పుడు పనిచేస్తూనే ఉంటుందని శివప్రసాద్ రెడ్డి తెలిపారు.
0 comments:
Post a Comment