వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటిషన్ను సుప్రీం కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈరోజు ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ముందు జగన్ తరపు న్యాయవాదుల తమ వాదనలు వినిపించారు. తాము పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై సిబిఐకి నోటీసులు ఇవ్వాలని కోరారు. సిబిఐ దీనికి అభ్యంతరం తెలిపింది. కేసును మరొక రోజు విచారించాలని కోర్టును కోరింది. సమయాభావం కారణంగా పిటిషన్ను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది. దీంతో బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు తొలుత ఈ నెల 30కి వాయిదా వేసింది. అదే రోజు నిమ్మగడ్డ ప్రసాద్, విజయసాయి రెడ్డి పిటిషన్లను విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
అయితే మూడు కేసులు ఒకేసారి విచారణ జరిపితే, ఒక కేసులో ఇచ్చే తీర్పు ప్రభావం మరో కేసుపై పడుతుందని జగన్ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. పైగా విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ కేసుల్లో ఇప్పటికే సిబిఐకి నోటీసులు ఇచ్చారని, ఈ కేసులో మాత్రం ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. దీంతో జగన్ బెయిల్ పిటిషన్పై విచారణను ఒక రోజు ముందుగా అంటే ఈ నెల 29నే చేపడతామని కోర్టు తెలిపింది.
0 comments:
Post a Comment