ఈ నెల 5 నుంచి 14 వరకు ప్రజాబ్యాలెట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ నెల 5 నుంచి 14 వరకు ప్రజాబ్యాలెట్

ఈ నెల 5 నుంచి 14 వరకు ప్రజాబ్యాలెట్

Written By news on Wednesday, April 3, 2013 | 4/03/2013

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే విధానాల వల్లే విద్యుత్ కష్టాలు వచ్చాయని వైఎస్ఆర్ సీపీ నేత, ఎంపీ మేకపాటి, కొణతాల రామకృష్ణలు అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ చేసిన ధర్నాలు విజయవంతం అయ్యాయని, ఈ నెల 5 నుంచి 14 వరకు ప్రజాబ్యాలెట్ యథావిధిగా కొనసాగుతుందని వారు తెలిపారు. 

ఈ నెల 9 తేదిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని ఎంపీ మేకపాటి, కొణతాల రామకృష్ణలు విజ్ఞప్తి చేశారు. సీబీఐ ముసుగులో యూపీఏ మనుగడ సాధిస్తోందని ములాయం చెప్పిన విషయాన్ని ఎంపీ మేకపాటి ఈ సందర్బంగా తెలిపారు. కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందని ఎంపీ మేకపాటి, కొణతాల రామకృష్ణలు అన్నారు. సీబీఐని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఎంపీ మేకపాటి, కొణతాల రామకృష్ణ ఆరోపించారు. 
Share this article :

0 comments: