వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే కేంద్రంలో ప్రభుత్వం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే కేంద్రంలో ప్రభుత్వం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే కేంద్రంలో ప్రభుత్వం

Written By news on Friday, April 12, 2013 | 4/12/2013

* 230 సీట్లు ఖాయం
* విజయమ్మ పేరులోనే విజయం ఉంది
* జగన్ త్వరలో బయటకు వస్తారు
* మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాంగ శ్రవణం
* వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు
* గందరగోళం తర్వాతే స్థిరత్వం వస్తుంది
* కుట్రలు, కుతంత్రాలు ఎంతో కాలం ఉండవు

 రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన ప్రభంజనం సృష్టించబోతోందని, వచ్చే ఎన్నికల్లో 230 అసెంబ్లీ స్థానాలకు తక్కువ కాకుండా గెలుస్తుందని ప్రముఖ సిద్ధాంతి మారేపల్లి రామచంద్రశాస్త్రి చెప్పారు. విజయ నామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని గురువారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజలు, పంచాంగ శ్రవణం చేశారు. సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడుతుందని, ఈ పార్టీ అనుగ్రహం లేకుండా ఏ వ్యక్తీ ప్రధానమంత్రి కాలేరని చెప్పారు. గ్రహ గతుల ఆధారంగా తాను ఈ అంశాలు చెబుతున్నానన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది కనుక గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రానికి ఉపకారాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు. కుట్రలు, కుతంత్రాలు ఎంతో కాలం కలిసి ఉండలేవని ఏదో ఒక రోజు విడిపోతాయని ఆ తరుణం కోసం ఎదురు చూడాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పై పోటీ చేయడం ఆత్మహత్యా సదృశ్యంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారని, మహా ప్రభంజనం ముందు ప్రాణాలు ఒడ్డడం ఎందుకని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జాతక రీత్యా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని, ఆయన త్వరలో బయటకు వచ్చి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళతారన్నారు.

రాష్ట్రంలో సూర్యచంద్రులు కలిశారా?
‘కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చి తీరతాయి. రకరకాల కూటములు, కొత్త ఫ్రంట్‌లు ఏర్పడే అవకాశం ఉంది. భాగస్వామ్య పార్టీలతో విభేదించి కూటములు మారుతుంటారు. ప్రజల పక్షాన ఉన్న వారినే విజయం వరిస్తుంది. రాష్ట్ర ప్రజలు ఈ ఏడాది పలు కష్టనష్టాలకు గురైనా అంతిమంగా సుఖశాంతులు పొందుతారు. ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రానికి కొత్తేమీ కాదు.. అయితే రాష్ట్రానికి ఇబ్బందులు అంతగా ఉండవు. గ్రహ గతుల ప్రకారం సూర్యచంద్రులు కలిస్తే అమావాస్య(చీకటి) వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి సూర్యచంద్రులు కలిసి పోయారా? అన్నట్లుగా ఉంది. సూర్యచంద్రులు సమదూరంలో ఉంటే పౌర్ణమి వస్తుంది. అది అందరికీ ఆహ్లాదకరమైనది. ప్రజలంతా సాధారణ ఎన్నికల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ అమావాస్యను ఎంత కాలం భరించాలి? పౌర్ణమి రావాలని కోరుకుంటున్నారు.

ప్రజలు చల్లగా ఉండాలి: విజయమ్మ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉగాది పండుగలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని విజయమ్మ గుర్తు చేసుకున్నారు. తాము ఎపుడైనా ఇల్లు మారాల్సి వచ్చినపుడు ఉగాది పండుగ తరువాత వచ్చే శుభప్రదమైన రోజున మారదామని వైఎస్ చెప్పేవారన్నారు. విజయనామ సంవత్సరంలో ప్రజలందరికీ మేలు జరిగి చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం ఉపనేత భూమా శోభానాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సూర్యచంద్రులు కలిసి పోయినట్లుగా ఉన్నారని... కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సాగిస్తున్న చీకటి పాలన మాదిరిగా పరిస్థితి ఉందన్నారు. విజయమ్మ తొలుత జ్యోతి వెలిగించి ఉగాది ఉత్సవాలను ప్రారంభించారు. ఎన్ని కష్టాల్లో ఉన్నా విజయమ్మ ప్రజల కోసం తపన పడటాన్ని ఆమెకు దగ్గరగా ఉండే తమలాంటి వారు చూసి ఆవేదన చెందుతుంటామని కానీ ఆమె మాత్రం నిబ్బరంగా ఉంటారని శోభ అన్నారు. జగన్ బయట ఉంటే ఉగాది ఇంకా ఆనందోత్సాహాలతో జరుపుకునే వాళ్లమన్నారు. తాను జగన్‌ను కలిసినప్పుడల్లా ప్రజల కోసం పోరాటాలు చేయాలని చెబుతున్నారని తెలిపారు. తొలుత విజయమ్మ జ్యోతి వెలిగించి ఉగాది ఉత్సవాలను ప్రారంభించారు.

పూలేకు నివాళులు...
మహాత్మా జ్యోతిరావ్ పూలే 186వ జయంతి సందర్భంగా విజయమ్మ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో మహాత్మా అని పేరు గాంచిన వారు ఇద్దరేనని, వారిలో ఒకరు గాంధీ మహాత్ములైతే, మరొకరు పూలే అని అన్నారు. గాంధీ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడితే, పూలే సామాజిక స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అన్నారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన పూలే మహిళా విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన సతీమణి తొలి మహిళా ఉపాధ్యాయిని కావడం విశేషమన్నారు. వైఎస్ 2009 ఏప్రిల్ 11న తొలిసారిగా పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నల్లా సూర్యప్రకాష్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఏ.సోమయాజులు, సంస్థాగత వ్యవహారాల కోఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్, అధికార ప్రతినిధి ఆర్.కె.రోజా, బి.జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కోన రఘుపతి, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

‘నూతన ఏడాది పేరు ‘విజయ’ నామ సంవత్సరం. వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలి పేరులోనే విజయం ఉంది. ఆమె నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయం. కార్యకర్తలు చేయాల్సిందల్లా ఇతోధికంగా ఆమెకు మద్దతు ప్రకటించడమే. అందరినీ కలుపుకొని పోయే ఉదారగుణం విజయమ్మ, జగన్, షర్మిలకు ఉంది. అందుకే గుడివాడ, బెజవాడలలో పాదయాత్ర సభలకు జనం పోటెత్తుతున్నారు. షర్మిల పాదయాత్ర ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిది.
- మారేపల్లి రామచంద్రశాస్త్రి, ప్రముఖ సిద్ధాంతి
Share this article :

0 comments: